ఈనెల 15న విశాఖలో చంద్రబాబు పర్యటన

-

టిడిపి అధినేత చంద్రబాబు ఈనెల 15న విశాఖలో పర్యటించనున్నారు. స్వాతంత్ర దినోత్సవం రోజు సాయంత్రం విశాఖ ఆర్కే బీచ్ సమీపంలోని NTR విగ్రహం వద్ద నుంచి 2 కిలోమీటర్ల మేర జాతీయ జెండాతో సమైక్యత పాదయాత్ర నిర్వహిస్తారు. అనంతరం ఎంజీఎం పార్క్ ఆవరణలో యువత మేధావులతో జరిగే సమావేశంలో విజన్ డాక్యుమెంట్ 2047ను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వెళ్తారు.

కాగా, విశాఖ రుషికొండపై నిర్మిస్తోంది సచివాలయమే అని వైసిపి ట్వీట్ ద్వారా తెలిసింది. రుషికొండ తవ్వకాలపై సీఎంను విమర్శిస్తూ టిడిపి ఓ వీడియో పోస్ట్ చేయగా… వైసిపి రిప్లై ఇచ్చింది. ‘ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసేందుకు విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించి రుషికొండపై సెక్రటేరియట్ నిర్మాణం చేపడుతున్నారు జగన్. దానిమీద దుష్ప్రచారం చూస్తుంటే మీకు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడం ఇష్టం లేదనిపిస్తోంది’ అని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version