ఒడిశా రైలు ప్రమాదంపై సీఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. తెలుగు ప్రయాణికులపై ఆరా

-

ఒడిస్సా రాష్ట్రంలో జరిగిన రైలు ప్రమాదంపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం జగన్… త్వరగా క్షత గాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ys jagan

బాధితులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ఎవరైనా ఉన్నారా అనే దానిపై ఆరా తీస్తున్నారు సీఎం జగన్. ఏపీ వారు ఉంటే వారికి తగిన సహాయం అందించాలని అధికారులను అలర్ట్ చేశారు సీఎం జగన్. కాగా, ఒడిశా రాష్ట్రంలోని బాలేశ్వర్ జిల్లా, బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో, కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఇది అత్యంత దురదృష్టకర సంఘటన అని సీఎం విచారం వ్యక్తం చేశారు. ఈ ఘోర ప్రమాదంలో పలువురు మృత్యువాత పడడం, మరెందరో తీవ్ర గాయాల పాలు కావడం పట్ల సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news