సీఎం జగన్ తన స్థాయిని తగ్గించుకొని వ్యాఖ్యలు చేస్తున్నారు – నాదెండ్ల మనోహర్

-

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన స్థాయిని తగ్గించుకొని వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్. ప్రజలు వైసిపి పై తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జనసేనకు ముఖ్యమంత్రి దగ్గర కండక్ట్ సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. అన్యాయాలను ప్రశ్నిస్తున్నందుకే తమ పార్టీని రౌడీసేన అంటున్నారని మండిపడ్డారు నాదెండ్ల మనోహర్.

సీఎం లో రెండు ముఖాలు ఉన్నాయని.. బయటకు కనిపించేది ఒకటైతే, తెర వెనుక మరొకటి ఉందన్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్ పరదాలు లేకుండా సొంత నియోజకవర్గంలో కూడా తిరగలేకపోతున్నాడని ఎద్దేవా చేశారు. ఇక ఉత్తరాంధ్రలో జనసేన బలోపేతంపై దృష్టి పెట్టామన్నారు. ఉత్తరాంధ్రలో భూదందాలపై జనసేన నేతలు పోరాటం చేస్తున్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news