2, 3 నెలల్లో బాధితులందరికీ నష్ట పరిహారం అందిస్తాం – వైఎస్‌ జగన్‌

-

ఇవాళ కోనసీమ వరద ప్రాంతాల్లో జగన్‌ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా లంక గ్రామాల్లో వరద బాధితులతో మాట్లాడి వారి సమస్యలను వింటున్న సీఎం… ముంపు బాధితులతో వారికి అందుతున్న ప్రభుత్వ సాయం పై ఆరా తీశారు. ఈ సందర్భంగా సిఎం జగన్ మాట్లాడుతూ అంచనాలు పూర్తి కాగానే ఆదుకుంటామని.. ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

CM Jagan Mohan Reddy
CM Jagan Mohan Reddy

నాది ప్రచార ఆర్భాటం కాదని.. నేను కూడా వరదల సమయంలో ఇక్కడికి వచ్చి, ఫోటోలకు ఫోజులిచ్చి డ్రామాలు చేస్తే టీవీల్లో కనిపించే వాణ్నిఅని పేర్కొన్నారు. కానీ దాని వల్ల ఏం ప్రయోజనం? ముఖ్యమంత్రి అనే వాడు వ్యవస్థలను నడిపించాలని పేర్కొన్నారు.

వరదల వల్ల జరిగిన నష్టాలపై వచ్చే 15 రోజుల్లో అధికారులు అంచనాలు తయారు చేయడం పూర్తి చేస్తారు. అది ఇల్లైనా పంటలైనా వేటినీ విడిచిపెట్టరు. 2, 3 నెలల్లో బాధితులందరికీ నష్ట పరిహారం అందిస్తామని ప్రకటన చేశారు వైఎస్‌ జగన్‌. వారికి తగిన వనరులు కూడా సమకూర్చాలి… అందుకే సహాయ పనులు, కార్యక్రమాలకు ఇబ్బంది లేకుండా అధికారులకు వారం రోజుల సమయం ఇచ్చానని స్పస్టం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news