కారుణ్య నియామకాలు చేపట్టాలి : సీఎం జగన్ ఆదేశాలు

-

 

సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు సీఎం జగన్ అండగా నిలిచారు. వెంటనే కారుణ్య నియామకాలు చేపట్టేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

అయితే ఖాళీలు, పాయింట్లు, రోస్టర్లతో సంబంధం లేకుండా ఈ నియామకాలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన సీఎం… కుటుంబానికి మూలస్తంభమైన వ్యక్తి చనిపోవడంతో కష్టాల పాలైన కుటుంబాలకు భరోసా కల్పించాలని అధికారులకు సూచించారు. కాగా, విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది జగన్ సర్కార్. నేడే జగనన్న అమ్మ ఒడి డబ్బులు జమ చేయనున్నారు సీఎం జగన్‌.

ఇందులో భాగంగానే, ఇవాళ ఉదయం సీఎం జగన్ మోహన్ రెడ్డి పార్వతీపురం మన్యం జిల్లా కురుపులు నియోజకవర్గం వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉదయం 8 గంటలకు తన నివాసం నుంచి బయలుదేరుతారు. అనంతరం 10 గంటలకు కురుపాం నియోజకవర్గం చినమేరంగి పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. ఈ సందర్భంగా జగనన్న అమ్మ ఒడి డబ్బులు జమ చేయనున్నారు సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news