నేడు సీఎం వైఎస్‌ జగన్‌ ఏలూరు జిల్లా పోలవరం పర్యటన

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పోలవరం పర్యటన ఖరారు అయింది. ఇవాళ ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఏలూరు జిల్లా పోలవరం పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్‌ పనుల పరిశీలన, అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి.

ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి.. 10 గంటల సమయానికి అక్కడికి చేరుకోనున్నారు. అనంతరం…. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. ప్రాజెక్ట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్న సీఎం జగన్.. అనంతరం తిరుగు ప్రయాణం కానున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయనున్నారు.