ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన..విజయవాడకు పయనం

-

ఢిల్లీలో సీఎం జగన్ పర్యటన ముగిసింది. ఇవాళ ఉదయం 8 గంటలకు ఆయన విజయవాడ బయలుదేరనున్నారు. నీతి అయోగ్ సమావేశంలో పాల్గొన్న సీఎం…కేంద్ర మంత్రులతోను సమావేశమయ్యారు.

నిన్న కేంద్ర హోంమంత్రి ఆమిత్ షాతో భేటీలో తెలుగు రాష్ట్రాల మధ్య పరిష్కారం కానీ అంశాలను వెంటనే పరిష్కరించాలని జగన్ కోరారు. ఇక అంతకు ముందు నీటి ఆయోగ్ మీటింగ్ లో జగన్.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు వైద్యం విషయంలో చేసిన కార్యక్రమాలను వివరించాడు.

అందులో ముఖ్యంగా ఇటీవల ప్రజారోగ్యం మరియు పౌష్టికాహారం లో భాగంగా వీటిని మొదటి ప్రాధాన్యతగా తీసుకుని రాష్ట్రంలో 10592 గ్రామ మరియు వార్డ్ క్లినిక్ లను ఏర్పాటు చేశామని జగన్ ఈ మీటింగ్ లో చెప్పారు. ఈ రోజుల్లో ప్రజలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వాళ్ళు వైద్యం కోసం ఎన్నో అగచాట్లు పడుతున్నారని.. కొన్ని సార్లు సరైన సమయానికి వైద్యం అందక ప్రాణాలు కోల్పోయిన చాలా సందర్భాలు ఉన్నాయని సవివరంగా చెప్పారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news