BREAKING: నేడు మేనిఫెస్టో ప్రకటించనున్న సీఎం జగన్

-

నేడు మేదరమెట్లలో వైసీపీ సిద్ధం 4వ సభ ఉండనుంది. ఈ తరుణంలోనే… మేదరమెట్లలో వైసీపీ చివరి సిద్ధం సభకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.సిద్ధం సభ ద్వారా వైసీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్. వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించనున్న సీఎం జగన్..రానున్న ఎన్నికలకు సంబంధించిన మ్యానిఫెస్టోను కూడా విడుదల చేసే అవకాశం ఉంది.

ఈ సిద్ధం సభ నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం 2.55 గంటలకు తాడేపల్లి లోని తన నివాసం నుండి హెలిక్రాఫ్టర్ ద్వారా బయలుదేరనున్న సీఎం జగన్..3.25 గంటలకు హెలిప్యాడ్ దగ్గరకు చేరుకోనున్నారు. 3.35 గంటలకు సిద్ధం సభా వేదిక వద్దకు చేరుకోనున్న సీఎం జగన్..3.40 నుంచి 5.10 గంటల వరకు సిద్ధం సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. 5.30 సభా పూర్తయిన అనంతరం సభాస్థలి నుంచి బయలుదేరి 6.00 గంటలకు తాడేపల్లి లోని తన నివాసానికి తిరిగి చేరుకోనున్నారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version