గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్

-

గ్రూప్ – 1, గ్రూప్ – 2, ఉద్యోగార్దులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో అతి త్వరలో ఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కానుంది. మొత్తం వెయ్యికి పైగా పోస్టులు ఉండే అవకాశం ఉంది. గ్రూప్ 1 లో వందకు పైగా పోస్టులు, గ్రూప్ 2 లో 900 కు పైగా పోస్టులు ఉన్నట్లు తెలుస్తోంది.

సీఎం ఆదేశాల మేరకు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ చురుగ్గా సాగుతుందని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలు తెప్పించుకున్నామని అధికారులు వెల్లడించారు. ఈ నోటిఫికేషన్ లో జారీకి అవసరమైన కసరత్తు తుది దశలో ఉందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news