BREAKING : ఈ రోజు హైదరాబాద్, రేపు ఢిల్లీలో సీఎం జగన్‌ పర్యటన

-

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఇవాళ బిజీ షెడ్యూల్‌ గడుపనున్నారు. ఈ రోజు, రేపు సీఎం వైయస్‌ జగన్‌ శ్రీకాకుళం జిల్లా, హైదరాబాద్, ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు తాడేపల్లి నుంచి బయలు దేరనున్నారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. మధ్యాహ్నం 3.40 గంటలకు ఆముదాలవలస చేరుకోనున్న సీఎం జగన్‌… ప్రభుత్వ జూనియర్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో జరిగే స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్నారు.

సాయంత్రం 5.20 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్ళనున్న ముఖ్యమంత్రి జగన్‌.. సాయంత్రం 6.55 గంటలకు నార్సింగి ఓమ్‌ కన్వెన్షన్‌లో జీవీ.ప్రతాప్‌ రెడ్డి కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్నారు. రాత్రి 7.50 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి ప్రయాణం కానున్నారు. రాత్రి 9.30 గంటలకు ఢిల్లీ చేరుకోనున్న జగన్.. రాత్రికి ఢిల్లీలో బస చేయనున్నారు. ఇక రేపు కేంద్ర మంత్రులు, ప్రధాని మోడీతో భేటీ కానున్నారు జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news