ఏపీ రైతులకు అలర్ట్‌..ఈ -క్రాప్ లో నమోదైన వారికే నష్ట పరిహారం

-

ఏపీ రైతులకు అలర్ట్‌..ఈ -క్రాప్ లో నమోదైన వారికే నష్ట పరిహారం అందిస్తామని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కామెంట్‌ చేశారు. ఖరీఫ్ 2021 సంవత్సర పంటల నష్టానికి సంబందించి బీమా సొమ్మును ముఖ్యమంత్రి జగన్ అందించారని వెల్లడించారు.

రైతులకు సంబంధించి పంటలను ఈ క్రాప్ లో నమోదు చేసుకుంటే బీమా ఇస్తున్నామని.. ఒకేసారి రూ.2977 కోట్లను రైతులకు అందించామని స్పష్టం చేశారు. కొందరు తట్టుకోలేక ఏదేదో మాట్లాడుతున్నారని ఆగ్రహించారు.

కొన్ని పత్రికల వాళ్లకు శిక్షణ ఇవ్వాలేమోనని.. అన్ని వివరాలూ జిల్లాల వారిగా ఇచ్చామని తెలిపారు. ఇందులో ఎలాంటి దాపరికం లేదు.. ఈ -క్రాప్ లో నమోదైన రైతులందరికీ నష్ట పరిహారం ఇస్తున్నామని తెలిపారు. గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని బీమా ను అందిస్తున్నామని.. కొందరికే బీమా ఇస్తున్నారని ప్రచారం చేయడం సరికాదని వెల్లడించారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Latest news