శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్‌సీపీ నేత హత్య

-

ఏపీలో మరో విషాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లాలో వైయస్సార్సీపీ నేత హత్య కలకలం రేపింది. గార మండల పరిషత్ ఉపాధ్యక్షుడు రామశేషు దారుణ హత్యకు గురయ్యారు. శ్రీకూర్మంలోని తన వ్యాపార గోడౌన్ కు వెళ్తున్నప్పుడు మాటు వేసి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పారిపోయారు. రక్తపు మడుగులో రామశేషుని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

రామసేషు హార్డ్వేర్, సిమెంట్, ఎరువులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. రామశేష్ పై ఆరేళ్ల క్రితం హత్యాయత్నం జరిగింది. ఈ సమయంలో తీవ్ర గాయాలు కాగా కోలుకున్నాడు. అప్పుడు ప్రాణాలతో రామశేషు బయటపడ్డారు. ఇప్పుడు దారుణ హత్యకు గురయ్యారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news