రూ. 500 కోట్ల విరాళాలు ఏం చేశారు..అందుకే దీక్ష చేస్తున్నాం – దేవినేని

-

రూ. 500 కోట్ల విరాళాలు ఏం చేశారు..అందుకే దీక్ష చేస్తున్నామన్నారు వైస్సార్సీపీ ఎన్టీఆర్ అధ్యక్షులు దేవినేని అవినాష్. విజయవాడ వరద బాధితులకు తక్షణ నష్ట పరిహారం అందించాలని కోరుతూ నిరాహార దీక్ష చేపట్టింది వైస్సార్సీపీ. ఈ సందర్భంగా వైస్సార్సీపీ ఎన్టీఆర్ అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ… వరద బాధితులకు అన్ని విధాల తోడుగా ఉండడానికి నిరాహార దీక్ష చేస్తున్నామన్నారు. వరద బాధితులకు మద్దత్తు గా వైస్సార్సీపీ కదిలిందని తెలిపారు.

devineni avinash

చంద్రబాబు వల్లనే వరదలు వొచ్చాయి…మైలవరం, జగ్గయ్యపేట, విజయవాడ సింగినగర్, ఇతర ప్రాంతాలు వరదల్లో ప్రజలు వున్నారని వివరించారు. వరదల్లో నష్టపోయిన వారికి ఒక్కరికి నష్ట పరిహారం అందించలేదు..రోజు కలెక్టరేట్ వద్ద వరద బాధితులు పడిగాపులు పడుతున్నారని తెలిపారు వైస్సార్సీపీ ఎన్టీఆర్ అధ్యక్షులు దేవినేని అవినాష్. వరద బాధితులకు నష్ట పరిహారం అడుగుతుంటే వైస్సార్సీపి మీద పడి ఏడుస్తున్నారు..ఫోటోలకు పోజులు ఇవ్వడం తప్ప కూటమి నేతలు చేసింది ఎమ్ లేదన్నారు. అబద్ధపు మాటలు, అబద్ధపు తీరు తప్ప ఎమ్ చేయడం లేదు..కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పోరాటమిది.. కూటమి ప్రభుత్వం పడిపోవడానికి ఇదే నాందన్నారు వైస్సార్సీపీ ఎన్టీఆర్ అధ్యక్షులు దేవినేని అవినాష్.

Read more RELATED
Recommended to you

Exit mobile version