జగన్ పాలనకు 3 ఏళ్లు…’గడప గడపకు మన ప్రభుత్వం’ పేరుతో ప్రభుత్వం ఉత్తర్వులు

-

సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పాలను నేటితో మూడు సంవత్సరాలు పూర్తి అయింది. ఈ నేపథ్యంలోనే జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్నట్టు వైసీపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మూడేళ్ల పాలన పూర్తైన సందర్భంలో ఎమ్మెల్యేలు గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో కార్యక్రమాలు చేపడతారని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం.

వైసీపీ మేనిఫెస్టోలో 95 శాతం హామీలను పూర్తి చేసినట్టు జీవోలో స్పష్టం చేసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం.. ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో కార్యక్రమం నిర్వహించాలని తెలిపింది.

గ్రామ, వార్డు స్థాయిలో లబ్జిదారుల జాబితాలను ఎమ్మెల్యేలకు అందజేయాలని జిల్లా అధికారులకు ప్రణాళిక శాఖ ఆదేశించింది. ఎమ్మెల్యేల పర్యటనలకు షెడ్యూళ్ల ఖరారు.. సమీక్షలకు అవసరమైన డేటా అందించేలా అధికారులు సహకరించాలని ప్రణాళిక శాఖ స్పష్టం చేసింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news