ఆంధ్ర ప్ర‌దేశ్‌కు గుడ్ న్యూస్.. రూ. 1,438.08 కోట్ల నిధులు విడుద‌ల‌

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వానికి కేంద్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్ర ప్ర‌దేశ్ కు రావాల్సిన రెవెన్యూ గ్రాంట్ ను కేంద్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. రెవెన్యూ లోటు కింద ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రానికి రూ. 1,438,08 కోట్లను కేంద్ర ప్ర‌భుత్వం విడుదల చేసింది. దీనికి సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం శుక్ర‌వారం రాత్రి జారీ చేసింది. 15 వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఈ నిధుల‌ను విడుద‌ల చేసింది.

దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఆంధ్ర ప్ర‌దేశ్ కు 11 వ విడుత రెవెన్యూ గ్రాంట్ నిధులను కేంద్రం విడుద‌ల చేసింది. కాగ ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంతో పాటు మొత్తం 17 రాష్ట్రాల‌కు రెవెన్యూ లోటు కింద నిధులను విడుద‌ల చేసింది. ఈ సారి రెవెన్యూ లోటుకు రూ. 9,871 కోట్ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం కేటాయించింది. వాటిని శుక్ర‌వారం ఆయా రాష్ట్రాల‌కు కూడా విడుద‌ల చేసింది. కాగ 15 వ ఆర్థిక సంఘం సిపార్సుల మేర‌కు 17 రాష్ట్రాల‌కు రెవెన్యూ లోటు కింద నిధుల‌ను విడుద‌ల చేస్తు ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news