ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..రూ. 40 వేల జీతంతో ఫ్లిఫ్ కార్ట్ లో జాబ్స్..

-

ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్..ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ప్రముఖ ఫ్లిప్ కార్ట్ సంస్థలో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది..
జూలై 29 శుక్రవారం నాడు భారీ జాబ్ మేళను నిర్వహించారు..అమలాపురంలో ఈ జాబ్ మేళా ఉంటుంది.. జగన్ సర్కార్ ప్రతి శుక్రవారం వివిధ ప్రాంతాల లో జాబ్ మేళాను నిర్వహించనున్నారు..ఇలా చెయ్యడం వల్ల నిరుద్యోగ సమస్య పూర్తిగా తగ్గుతుందని అధికారులు అభిప్రాయ పడుతున్నారు..

ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు హెచ్ఆర్ మరియు ఫైనల్ రౌండ్ నిర్వహిస్తారు. తద్వారా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు సైతం అమలాపురంలోనే పని చేయాల్సి ఉంటుంది..

ఈ జాబ్ మేళా ద్వారా ఏకంగా మొత్తం 55 ఖాళీలను భర్తీ చేయనున్నారు. డెలివరీ అసోసియేట్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వయస్సు 18-45 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు జీతం ఉంటుంది.

పూర్తీ వివరాలు..

*. అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

*. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు Instakart Services, Door No.4-5-3/1, Peramma Agrahara, Y-Junction, Amalapuram, AP-533201

*. చిరునామాలో ఈ నెల 29 ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.

*. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 9581422339 నంబర్ ను సంప్రదించాల్సి ఉంటుంది.

*. అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో Resume, ఆధార్, విద్యార్హతల సర్టిఫికేట్లు, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ వెంట తీసుకురావాల్సి ఉంటుంది..ఉద్యోగాలకు అప్లై చేస్తున్న అభ్యర్ధులు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేయగలరు..

Read more RELATED
Recommended to you

Latest news