ఏపీ VRO లకు జగన్‌ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌

-

ఏపీ VRO లకు జగన్‌ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని గ్రేడ్-1, 2 గ్రామ రెవెన్యూ అధికారులకు ప్రభుత్వం అండగా నిలిచింది. సర్వీస్ లో ఉన్న గ్రేడ్-1, 2 వీఆర్వో మరణిస్తే అతనికి కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకానికి అవకాశం కల్పించారు.

ఏపీ వీఆర్వో సర్వీస్ నిబంధనలు 2018 లో మార్పులు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నిర్ణయంతో గ్రేడ్-1, 2 వీఆర్వో కుటుంబంలో డిగ్రీ విద్యార్హత కలిగిన భాగస్వామి పిల్లలకు కారుణ్య నియామకం కింద జూనియర్ అసిస్టెంట్, ఈ క్యాడర్ కు సమానమైన ఉద్యోగాల్లో అవకాశం దక్కుతుంది. కారుణ్య నియామకాలపై విఆర్వోలు ఏళ్ల తరబడి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గత ప్రభుత్వాలు వీఆర్వోల డిమాండ్ ను పట్టించుకోలేదు. ఇప్పుడు జగన్ సర్కార్ వీఆర్వోల డిమాండ్ ను పరిగణలోకి తీసుకొని సుదీర్ఘకాల డిమాండ్ ను నెరవేర్చింది.

Read more RELATED
Recommended to you

Latest news