జగన్ రెడ్డికి సిగ్గుందా?: పయ్యావుల కేశవ్

-

టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసిపి పై టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుప్పంలో వైసిపి నేతలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టిడిపి కార్యకర్త రక్తం చూసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు పయ్యావుల కేశవ్. చంద్రబాబు పర్యటనను అడ్డుకునే కుట్రలు సిగ్గుచేటు అన్నారు.

అసలు జగన్ రెడ్డికి సిగ్గుందా? అంటూ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల తర్వాత జగన్కు చుక్కలు చూపిస్తామన్నారు. టిడిపి కార్యకర్తలు తిరగబడితే ఎలా ఉంటుందో జగన్ కి చూపిస్తామన్నారు కేశవ్. పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్ ను ఎలా ధ్వంసం చేస్తారని మండిపడ్డారు. టిడిపి కార్యకర్తపై చేయి ఎత్తిన ఏ ఒక్కరిని వదిలేది లేదని మరోసారి స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news