పోలవరం విషయంలో జగన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు – దేవినేని ఉమ

-

ఎన్టీఆర్ జిల్లా: పోలవరం విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. మైలవరం టిడిపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యువగళం 100రోజులు పూర్తైన సందర్భంగా మైలవరంలో 15వ తేదీన మధ్యాహ్నం ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుండి పాదయాత్ర జరుగుతుందని తెలిపారు.

ఈ పాదయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పోలవరం విషయంలో ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా వ్వవహరిస్తున్నారని.. రెండు సీట్లే గా పోనీయమంటున్నారని ఆరోపించారు. ఇరిగేషన్ మంత్రి, జిల్లా మంత్రి, ఎమ్మెల్యే కలిసి దోచుకుంటున్నారని ఆరోపించారు దేవినేని ఉమ. ల్యాండ్,శాండ్, వైను, మైను, సెంటు పట్టా లక్ష్యం గా దోపిడీ జరుగుతుందన్నారు. అధికారులు, మంత్రులు వెంటనే స్పందించి నష్టపోయిన రైతుకు ఏం న్యాయం చేస్తారో చెప్పాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news