టీడీపీ, జనసేన వాళ్లు రాష్ట్ర ద్రోహులు, దేశ ద్రోహులు – సీఎం జగన్‌

-

టీడీపీ, జనసేన వాళ్లు రాష్ట్ర ద్రోహులు, దేశ ద్రోహులు అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్‌. ఇవాళ కోన సీమ జిల్లాలో సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇంత మంచి చేశాం కాబట్టే, ఇంత మంచి చేశాం అని చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదని చురకలు అంటించారు.

ఇంత మంచి మా చంద్రబాబు చేశాడని చెప్పే ధైర్యం ఆ దత్తపుత్రుడికి లేదు, ఆ ఈనాడు లేదకు, ఆ ఆంధ్రజ్యోతిలేదు, ఆ టీవీ–5కు లేదు, ఎల్లోమీడియాకు లేదని చురకలు అంటించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాల్లో 95శాతం పూర్తిచేశామని చెప్పే నైతికత మనకు మాత్రమే ఉందని… కాబట్టే మన ప్రభుత్వం ఏంచేసిందో చెప్పడానికి మన ఎమ్మెల్యేలు గడగడపకూ బయల్దేరారని వెల్లడించారు.

ఈ 34 నెలల కాలంలో మన పాలనలో ఏయే పథకాలు అందాయో ప్రతి కుటుంబానికి, ఆ కుటుంబంలోని అక్కచెల్లెమ్మల పేరుమీద లేఖలు రాసి…., ఆ లేఖలు ఇచ్చి, వారి ఆశీర్వాదాలు తీసుకునే కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు బయల్దేరారని చెప్పారు. ఇదిగో మేం వాగ్దానాలు చేసిన మేనిఫెస్టో, 95శాత వాగ్దానాలను అమలు చేశామని.. మీరే చూడండి, మీరే టిక్కులు పెట్టండని సీఎం జగన్‌ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news