ఇవాళ అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో జగన్ పర్యటన

-

ఇవాళ సీఎం వైయస్‌ జగన్‌ అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. రెండో రోజు కూడా గోదావరి వరద ప్రాంతాల్లో పర్యటించి, బాధితులతో నేరుగా మాట్లాడనున్న సీఎం వైఎస్‌ జగన్‌…ఉదయం 8.30 గంటలకు రాజమహేంద్రవరం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ నుంచి బయలుదేరనున్నారు. ఏఎస్‌ఆర్‌ జిల్లా చింతూరు చేరుకోనున్న సీఎం….ఉదయం 9.30 గంటలకు చింతూరు మండలం కుయుగూరు, చట్టి గ్రామాల్లో వరద బాధితులతో సమావేశం కానున్నారు.

అక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కన్నయగుట్ట గ్రామం చేరుకోనున్న సీఎం జగన్….అక్కడ ఏర్పాటు చేసిన వరద బాధిత గ్రామాలకు సంబంధించిన ఫోటో గ్యాలరీని పరిశీలించనున్నారు. అనంతరం తిరుమలాపురం, నార్లవరం గ్రామాలకు చెందిన వరద బాధితులతో సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news