ఈడి ఎదుట హాజరైన జేసీ ప్రభాకర్ రెడ్డి

-

హైదరాబాద్ బషీర్ భాగ్ లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ఎదుట జెసి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ప్రభాకర్ రెడ్డి తో పాటు ఆయన కుమారుడు అశ్విత్ రెడ్డి కూడా ఉన్నారు. గతంలో బిఎస్-3 వాహనాలను బిఎస్- 4 గా మార్చి రిజిస్ట్రేషన్ చేసినట్లు జెసి ట్రావెల్స్ పై పలు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో భాగంగానే ఇప్పటికే జేసీ కంపెనీ పై ఈడీ కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేసింది.

154 బస్సులను స్క్రాప్ కింద అశోక్ లేలాండ్ వద్ద కొనుగోలు చేసినట్లు తేలింది. ఫోర్జరీ డాక్యుమెంట్లతో నాగాలాండ్ రాజధాని కోహిమాలో రిజిస్ట్రేషన్ చేయించి ఎన్వోసీని పొందారు. దీనిపై జెసి ట్రావెల్స్ పై ఇప్పటికే ఈడి అధికారులు కేసు నమోదు చేశారు. ఈడి అధికారులు జారీ చేసిన నోటీసుల మేరకే ప్రభాకర్ రెడ్డి నేడు ఈడి ఎదుట హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news