హలో ప్రభాకర్ …! ఫోన్ చేసిన బాబు ? షాకింగ్ రిప్లై ఇచ్చిన జేసి ?

-

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం పరామర్శ పేరుతో ఇటీవల జైలుకు వెళ్లి వచ్చిన నాయకులందరినీ స్వయంగా వెళ్లి కలవడం, ఫోన్ చేసి కుశల ప్రశ్నలు వేయడం వంటివి చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చిన బాబు ఇదే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఇంటికి బాబు స్వయంగా వెళ్లి పరామర్శించారు. అలాగే ఓ హత్యా నేరం కేసులో ఇరుక్కున్న కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇదిలా ఉండగా, ఇటీవల వాహనాల అక్రమ అమ్మకాల వ్యవహారంలో అనంతపురం జిల్లా కీలక నాయకుడు, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి అరెస్టయ్యారు.

చాలా రోజుల పాటు ఆయన జైలు జీవితం గడిపారు. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చిన సందర్భంగా అభిమానులు ర్యాలీ ఏర్పాటు చేయగా దానిని పోలీసులు కోవిద్ నిబంధనలు ఉండడంతో అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ తో దురుసుగా ప్రవర్తించడంతో మరో కేసులో ఇరుక్కున్నారు. మళ్లీ జైలుకు వెళ్లి ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చారు. ఇదిలా ఉండగా ప్రభాకర్ రెడ్డిని స్వయంగా పరామర్శించేందుకు చంద్రబాబు సిద్ధమై, ఆయనకు ఫోన్ చేసి కుశలప్రశ్నలు వేయడంతో పాటు, తాను స్వయంగా ఇంటికి వస్తాను అంటూ ఫోన్ లో విషయం చెప్పగా, దయచేసి మా ఇంటికి రావద్దు అంటూ జేసీ గట్టి షాకే ఇచ్చారట.

ప్రస్తుతం ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అయితే చంద్రబాబు స్వయంగా ఇంటికి వస్తాను అంటే ఎగిరి గంతేయాల్సిన జెసి బ్రదర్స్ ఒక్కసారిగా, చంద్రబాబును తమ ఇంటికి రావద్దని చెప్పడం వెనుక కారణాలు చాలానే ఉన్నాయి. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం జేసీ బ్రదర్స్ ను టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేయడంతో పాటు, పాత కేసులను బయటకు తీస్తూ, హడావుడి చేస్తోంది. ఈ తరుణంలో చంద్రబాబు మరోసారి పరామర్శ యాత్ర పేరుతో, తన ఇంటికి వస్తే, మరేదైనా కేసులో ఇరికించే ప్రమాదం ఉందనే భయంతోనే జెసి బ్రదర్స్ చంద్రబాబు పరామర్శకు బ్రేక్ వేసినట్టుగా ప్రచారం జరుగుతోంది.

అదీకాకుండా ప్రస్తుత పరిస్థితితులు అంత అనుకూలంగా లేకపోవడంతో, మరి కొంత కాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉండడమే బెటర్ అనే అభిప్రాయంలో జెసి బ్రదర్స్ ఉన్నారట. అందుకే చంద్రబాబు వస్తాను అన్నా, మరోసారి తాము టార్గెట్ అవుతామన్న భయంతోనే జెసి బ్రదర్స్ చంద్రబాబు షాకింగ్ రిప్లై ఇచ్చారట.

-Surya

Read more RELATED
Recommended to you

Latest news