ప్రొక్లెయిన్ చూసి అయ్యన్న పారిపోయాడు…కొడుకు గోడదూకి పారిపోయాడు – జోగి రమేష్

-

ప్రొక్లెయిన్ చూసి అయ్యన్న పారిపోయాడు…కొడుకు గోడదూకి పారిపోయాడని జోగి రమేష్ చురకలు అంటించారు. నేను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే నా పదవికి రాజీనామా చేస్తానని.. రాజ్యాంగం టీడీపీ వారికి వర్తించదా? అని నిలదీశారు. ఎలాగైనా వ్యవహరించవచ్చని రాసుందా? చింతకాయల విజయ్ అనేవాడు అరాచకవాదని.. ఫైర్‌ అయ్యారు.

ఐటీడీపి అనే దాన్ని అతను పర్యవేక్షిస్తున్నాడని… మహిళల మాన, ప్రాణాల గురించి వెబ్ సైట్ లో దారుణంగా పోస్టులు పెట్టాడని మండిపడ్డారు. అతని దగ్గరకు సీఐడీ పోలీసులు వెళ్తే దాడి చేసినట్టు తప్పుడు కథనాలు రాశారని… దొంగ ఇంటికి పోలీసులు వెళ్తారని తెలీదా? అని ప్రశ్నించారు.

విజయ్ తప్పు చేయకపోతే ఎందుకు గోడ దూకి పారిపోయాడు? ఒక దొంగని ఎల్లోమీడియా సపోర్టు చేస్తోందన్నారు. విజయ్ తప్పు చేయకపోతే ధైర్యంగా వచ్చి ఆ మాట సీఐడీ పోలీసులకు చెప్పాలని.. ప్రభుత్వ స్థలాన్ని తండ్రి ఆక్రమించాడని ఆగ్రహించారు. అయ్యన్నపాత్రుడు నోరు తెరిస్తే పచ్చిబూతులు మాట్లాడుతున్నారని.. చంద్రబాబు, అయ్యన్న పాత్రుడుకి కొడుకుల మీద నమ్మకం పోయినట్లుందని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news