ఎమ్మెల్యే కేతిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు…మీకు చాకిరీ చేస్తున్నామంటూ ప్రజలపై సీరియస్‌

-

వైసీపీ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మా కొంపంతా మీకు చాకిరీ చేస్తున్నామంటూ జనం పై అసహనం వ్యక్తం చేశారు. ఇలా మా ఇంటిల్లిపాది మీకే చాకిరీ చేస్తున్నామని.. అయినా లోకేష్ లాంటి పనికిమాలిన వాడు విమర్శలు చేస్తుంటాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మొన్న పరోటా, పుల్కాలు ఇద్దరు పాదయాత్ర చేశారని.. నాపై అనవసరమైన విమర్శలు చేశారని ఆగ్రహించారు. టిడ్కో ఇళ్లు నేను కట్టిస్తే వారు కట్టించామంటారు.. ధర్మవరంలో 12 వేల ఇళ్లు కట్టించాను.. తాగునీటి సమస్య లేకుండా చేశానని వివరించారు.

చంద్రబాబు హయాంలో ధర్మవరంలో ఒక్క ఇల్లు అయినా కట్టించాడా..! అని నిలదీశారు. ఎవరైనా చదువుకోమని పిల్లలకు చెబుతారన్నారు. కానీ పనికిమాలిన లోకేష్ 20 కేసులు ఉంటే కానీ నా వద్దకు రావద్దు అంటాడని.. వీడు ఒక ముఖ్యమంత్రి కొడుకు.. కాబోయే ముఖ్యమంత్రి అట అంటూ చురకలు అంటించారు వైసీపీ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version