నేడు కృష్ణా జిల్లాలో పర్యటించనున్న కిషన్ రెడ్డి

-

నేడు (ఆదివారం) కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. జాతీయ పతాక ఆవిష్కరణ రూపకర్త పింగళి వెంకయ్య స్వగ్రామం బట్ల పెనుమర్రు లో ఆజాధికా అమృత్ మహోత్సవంలో పాల్గొననున్నారు. కిషన్ రెడ్డి తో పాటు బిజెపి ముఖ్య నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు విజయవాడలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నేతలు, కార్యకర్తలతో కిషన్ రెడ్డి సమావేశం అవుతారు.

 

11:15 కు ఫోటోగ్రాఫర్స్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. మధ్యాహ్నం 12:45 గంటలకు కేఎల్ యూనివర్సిటీలో జరిగే ప్రత్యేక కార్యక్రమానికి కిషన్ రెడ్డి హాజరవుతారు. సాయంత్రం 4:30 గంటలకు ఆజాదీక అమృత్ మహోత్సవంలో భాగంగా పింగళి వెంకయ్య స్వగ్రామమైన కృష్ణాజిల్లా బట్ల పెనుమర్రు లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. తిరిగి రాత్రి 8 గంటలకు ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.

Read more RELATED
Recommended to you

Latest news