టీఆర్ఎస్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

-

టీఆర్ఎస్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే లోక్‌ సభ ఎన్నికల సమయం వరకు టీఆర్‌ఎస్‌ పార్టీ పని ఖతమన్నారు. మునుగోడులో ఉప ఎన్నిక రావాలని TRS కోరుకుంటుంది… రావద్దని కాంగ్రెస్ కోరుకుంటుందన్నారు. పాత బస్తీలో ను పాగా వేస్తామని.. ఎవరు ఎక్కడి నుండి పోటీ చేయాలని అనేది పార్టీ అధినాయకత్వం నిర్ణయిస్తుందని వెల్లడించారు.

సొంతంగా ప్రకటించుకునే సంప్రదాయం పార్టీ లో లేదని.. TRS కి 15 సీట్ల కన్నా ఎక్కువ రావన్నారు. మోడీ, నడ్దా లే మా బాస్ లని.. ఎవరైనా కాషాయ జండా కింద పని చేయాల్సిందేనని పేర్కొన్నారు. ఇక కెసిఆర్ ఆటలు చెల్లవని.. ఇన్ని రోజులు ప్రత్యామ్నాయం లేక అందరూ అణిగి మణిగి ఉన్నారన్నారు. కెసిఆర్ కుటుంబం ఎవరు ఎక్కడ ఉన్నారో ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారని.. ఏ మాఫియా వెనుక అయిన trs నేతలు ఉంటారని ఆరోపించారు. హైదరాబాద్ లో వ్యాపారం చేసుకునే పరిస్థితి లేదని.. వ్యాపారస్తులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు బండి సంజయ్‌.

Read more RELATED
Recommended to you

Latest news