చంద్రబాబుకే కాదు.. టీడీపీ పార్టీకి ఇవే చివరి ఎన్నికలు – కొడాలి నాని

-

చంద్రబాబుకే కాదు.. టీడీపీ పార్టీకి ఇవే చివరి ఎన్నికలు అని కొడాలి నాని విమర్శలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. తెలుగు దేశం పార్టీ బూతుల పార్టీ అయిందని ఫైర్‌ అయ్యారు.

ఆ పార్టీ కాపాడే నాధుడే లేడన్నారు. దత్తపుత్రుడు, చంద్రబాబు కలిసి ఏం చేసినా.. వైసీపీదే అధికారమని తేల్చి చెప్పారు కొడాలి నాని. రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఎక్కడున్నాయి.. లేని సమస్యలను పవన్ కళ్యాణ్, చంద్రబాబు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

వారిద్దరూ వాళ్ళ సమస్యలతోనే సతమతమవు తు న్నారని వ్యాఖ్యానించారు. ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. ఎవరో తాగుబోతులు పవన్ ఇంటి ముందు హడావిడి చేస్తే రెక్కీ చేశారని అన్నారని ఏద్దేవా చేశారు. ఇడుపులపాయలో హైవే వేయాలంటే పవన్ ప్రధాని అవ్వాలని.. ప్రధాని కావడం కోసం పవన్ కళ్యాణ్, కే ఏ పాల్ తో పోటీ పడుతున్నాడా? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news