కబ్జాకోరుల చేతిలో శాంతిభద్రతలు ఖూనీ అయ్యాయి – నారా లోకేష్

-

వైసీపీ ప్రభుత్వం పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్. జ‌గ‌న్ రెడ్డి గారు మూడు రాజ‌ధానుల‌తో అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ అంటుంటే ఏంటో అనుకున్నా.. కానీ మూడు ప్రాంతాల్లో క‌బ్జాలు, దందాల‌ వికేంద్రీక‌ర‌ణ అని ఇప్పుడు అర్థ‌మైందని చురకలంటించారు. విశాఖ‌లో జగన్ గ్యాంగ్ ఎంపీ భార్య‌, కొడుకుని కిడ్నాప్ చేసి వంద‌ల‌కోట్లకి సెటిల్మెంట్ చేసుకుందని ఆరోపించారు.

జ‌గ‌న్ రెడ్డి ప్రియ‌శిష్యుడు యూట్యూబ్ స్టార్ బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి విజ‌య‌వాడ‌లో వందల‌ కోట్ల విలువైన భూమి క‌బ్జా కోసం క్రిమిన‌ల్స్‌ని రంగంలోకి దింపి భ‌య‌భ్రాంతుల‌కి గురి చేస్తున్నాడని ఆరోపించారు. కానూరు ట్రస్ట్ భూములు కొట్టేసేందుకు పోలీసుల‌తో కుమ్మ‌క్క‌యి ఎన్ఆర్ఐపై త‌ప్పుడు కేసులు పెట్టించిన బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి.. ఎన్ఆర్ఐ తరపున ఈ కేసు వాదించే లాయ‌ర్‌ని చంపించేందుకు రెక్కీ నిర్వ‌హించారని అన్నారు. ఇదీ జ‌గ‌న్ రెడ్డి రాక్ష‌స పాల‌న‌ అని.. హంత‌కులు, గూండాలు, క‌బ్జాకోరుల చేతిలో శాంతిభ‌ద్ర‌త‌లు ఖూనీ అయ్యాయని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news