ఉమామహేశ్వరి మృతి ఓ మిస్టరీ..బాంబు పేల్చిన లక్ష్మీపార్వతి

-

ఉమామహేశ్వరి మృతి ఓ మిస్టరీ అంటూ బాంబు పేల్చారు నందమూరి లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్ కుటుంబంలో జరుగుతున్న సంఘటనలు చాలా బాధగా ఉన్నాయని… ఉమామహేశ్వరి మృతికి నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఏమీ జరిగిందనేది మిస్టరీగానే ఉందని.. చంద్రబాబు నీచ రాజకీయాలు తెలిసిన వారు అనుమానించక తప్పదని ఆగ్రహించారు. ఆ కుటుంబానికి చంద్రబాబు ఒక శనిలా పట్టుకున్నాడని.. సింహగర్జనకు సిద్దమవుతున్న ఎన్టీఆర్ చంద్రబాబు చర్యల వల్ల గుండెతో మరణించారని నిప్పులు చెరిగారు. ఆయన బ్యాంక్ అకౌంట్లు కూడా సీజ్ చేసి అధ్యక్ష పదవి కూడా లాక్కున్నారని.. లక్ష్మీపార్వతి నీ బూచిగా చూపి కుటుంబాన్ని నమ్మించారని ఓ రేంజ్‌ ఆగ్రహించారు.

హరికృష్ణకు మంత్రి పదవి ఇచి 6 నెలల్లోనే లాగేసుకున్నాడని.. మానసికంగా హరికృష్ణను ఎన్నో ఇబ్బందులు పడ్డారని మండిపడ్డారు. అందుకే ఈ రోజుకీ కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు మాట్లాడరని.. ఈమె మరణం కూడా మిస్టరీ గా మారింది…సోషల్ మీడియాలో అనేక పోస్టులు వస్తున్నాయని ఆరోపించారు. అందులో కొన్ని నమ్మేవి…నమ్మనివి ఉండొచ్చని.. పోలీసులు ఒక లేఖ రాసి ఉండొచ్చు అన్నారని తెలిపారు.

చంద్రబాబు రంగప్రవేశం చేశాక ఆ లేఖ మాయం అయింది అంటున్నారని.. కోడెల మరణంలో కూడా ఇదే జరిగింది…ఆయన ఫోన్ రికార్డ్సలో చంద్రబాబు గురించే ఉందని వెల్లడించారు. అందుకే ఆయన ఫోన్ ఇప్పటికీ ఆచూకీ లేదని.. మీ నాన్న పేరు చెప్పకుండా ఎన్టీఆర్ నీ చంపి ఆయన పేరే చెప్పు కుంటున్నారన్నారు.అలాంటి ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలేమిటి… అస్తి వివాదాల్లో ఆమె ఆత్మహత్య చేసుకుందని నా అనుమానం అన్నారు. నీ కొడుకును అందలం ఎక్కించడానికి నువ్వు ఏదైనా చేస్తావ్.. ఒకవేళ నువ్వు కారణం కాకపోతే వారి సమస్య ఏమిటో పెద్దగా పరిష్కరించ లేవా అని పేర్కొన్నారు. ఆమె సూసైడ్ నోట్ నువ్వు దొంగిలించావ్ అని ప్రచారం జరుగుతుందని.. ఇప్పటికైనా పార్టీని బాలకృష్ణకు అప్పజెప్పి పక్కకు తప్పుకో పేర్కొన్నారు. దీంట్లో ఏమీ లేదంటే నువ్వే వెంటనే సీబీఐ విచారణకు లేఖలు రాయాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news