జగన్ ప్రోత్సాహంతోనే మ‌ట్టి మాఫియాలు, గ‌డ్డం గ్యాంగులు బరి తెగిస్తున్నాయి : నారా లోకేష్

-

అమరావతి : కృష్ణాజిల్లా గుడివాడ మండలం మోటూరులో అర్ధ‌రాత్రి సాగుతున్న మ‌ట్టి త‌వ్వ‌కాల‌ని అడ్డుకున్న అర‌వింద్‌పై దాడి ముమ్మాటికీ ప్ర‌భుత్వ ప్రాయోజిత కొడాలినాని పనేనని పేర్కొన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. మ‌ట్టిమాఫియాని అడ్డుకున్న రెవెన్యూ ఇన్‌స్పెక్ట‌ర్‌పై జేసీబీతో దాడి చేసిన గ‌డ్డంగ్యాంగ్ ని అరెస్ట్ చేయాలని…మంత్రి ప‌ద‌వి పోయిన‌ క్యాసినో స్టార్ విశ్వ‌రూపం చూపిస్తానంటే ఏంటో అనుకున్నానని తెలిపారు.

ఇలా త‌న మాఫియా గ్యాంగుల‌ని అడ్డుకునే రెవెన్యూ అధికారుల‌పై దాడులు చేయ‌డ‌మా విశ్వ‌రూపం అంటే..! ఆర్ఐ అర‌వింద్ వైపు అదృష్టం ఉండి బ‌తికి బ‌ట్ట‌క‌ట్టాడని పేర్కొన్నారు.లేదంటే చంపేసేవారే. ద‌య‌చేసి ప్ర‌భుత్వ ఉద్యోగులు, పోలీసులు కాస్తా జాగ్ర‌త్త‌గా వుండండన్నారు.

సీఎం ప్రోత్సాహంతోనే మ‌ట్టి మాఫియాలు, గ‌డ్డం గ్యాంగులు బరి తెగిస్తున్నాయన్నారు.ఆర్ఐపై దాడిచేసిన మ‌ట్టి మాఫియా..దాని వెనుకున్న గ‌డ్డం గ్యాంగ్ బాస్‌ని అరెస్టు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నానని చెప్పారు. విధుల్లో ఉన్న ప్ర‌భుత్వ ఉద్యోగులు, అధికారుల‌కి ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోరుతున్నానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news