ఆడబిడ్డల్ని ఏడిపిస్తున్న పాపం ఊరికే వదలదు జగన్ రెడ్డి – నారా లోకేష్

-

ఆడబిడ్డల్ని ఏడిపిస్తున్న పాపం ఊరికే వదలదు జగన్ రెడ్డి అని నిప్పులు చెరిగారు నారా లోకేష్‌. వైసిపి నాయకుల పైశాచికత్వానికి రాష్ట్రంలో మహిళలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ఫైర్‌ అయ్యారు లోకేష్‌. కొత్తపట్నం మండలం ఆలూరులో జరిగిన గడప గడపకు కార్యక్రమంలో తమ సమస్యలపై బాలినేనిని ప్రశ్నించిన మహిళ…. కవిత ఇంటికి వైసీపీ మూకలు తాళాలు వేసి వేధించడం దారుణమని చెప్పారు.

సమస్యలు పరిష్కరించమని ప్రశ్నించినందుకు నీళ్లు, పాలు కూడా తెచ్చుకునే వీలు లేదంటూ నిర్బంధిచడమే వైసిపి పాలనలో మహిళలకు దక్కిన గౌరవమా ? కవితను వేధిస్తున్న బాలినేని అనుచర గణం,వారికి సహకరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు నారా లోకేష్‌.

జగన్ అధికారంలో కొచ్చిన వెంట‌నే అన్న‌గారి పేరు మీద ద్వేష‌మో .. ఆక‌లి జీవులంటే అస‌హ్య‌మో తెలియ‌దు కానీ అన్న క్యాంటీన్ల‌ని మూసేశారంటూ ఆయన విమర్శలు గుప్పించారు. అన్న క్యాంటీన్లకు తాళాలేయ‌డంతో పేద‌లు, కూలీలు, అభాగ్యుల ఆక‌లి తీర్చే మార్గం లేకుండా పోయిందని, చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా 201 అన్న క్యాంటీన్లు ప్రారంభించారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news