ఎన్టీఆర్ దేవుడైతే.. చంద్రబాబు రాముడు : టీడీపీ ఆవిర్భావం పై లోకేష్ ట్వీట్

-

నేడు తెలుగుదేశం పార్టీ 40 వసంతాల పండుగ. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. 40 వసంతాల పసుపు పండుగ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని నారా లోకేష్ పేర్కొన్నారు. దేవుడు ఎన్టీఆర్ గారు, రాముడు చంద్రబాబు గారు మన ధైర్యం, కార్యకర్తలు మన బలం, పసుపు జెండా మన పవర్ అని వెల్లడించారు.

దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది మా తాత, అభివృద్ధిని పరిచయం చేసింది మా నాన్న అని.. అధికారం ఉన్నా లేకపోయినా ప్రతి క్షణం ప్రజల గురించి ఆలోచించేది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని నారా లోకేష్ స్పష్టం చేశారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే దిశగా అడుగులు వేద్దామని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. కాగా తెలుగుదేశం పార్టీ ఏర్పడి మార్చి 29వ తేదీ… అంటే నేటితో 40 వసంతాలు పూర్తి చేసుకుంటోంది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ 41 ఆవిర్భావ దినోత్సవం నిర్వహించేందుకు ఆ పార్టీ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news