తెలంగాణ యువకుడితో ఏపీ యువతి ప్రేమ..చివరికి ఆత్మహత్య

-

తెలంగాణ యువకుడితో ఏపీ యువతి ప్రేమ వ్యవహారం నడిపింది. అయితే.. ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ప్రియురాలు సూసైడ్ చేసుకుంది. ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన భూక్య రమేష్ ను ప్రేమించిన యువతి యేసు రాణి… రమేష్ వివాహానికి నిరాకరించడం తో కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

రెండు నెలలో వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి చేసుకోకపోవడంతో మనస్థాపానికి గురైన ఏసు రాణి.. తాజాగా ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. దీంతో చిల్లకల్లు పోలీస్ స్టేషన్లో యువతి తల్లి సైదమ్మ ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు చిలకల్లు పోలీసులు. మేకల యేసు రాణి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో ఓ ప్రైవేటు ఉద్యోగిగా కొనసాగుతోందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news