పవన్‌తో జానీ-ఖూనీ, గబ్బర్ సింగ్ – రబ్బర్ సింగ్ సినిమాలు చేస్తా – జోగి రమేష్

-

 

2024 తర్వాత పవన్ తో రెండు సినిమాలు తీస్తాను…జానీ-ఖూనీ, గబ్బర్ సింగ్ – రబ్బర్ సింగ్ అని టైటిల్‌ పెడతానని ప్రకటించారు మంత్రి జోగి రమేష్. 2024 ఎన్నికల తరువాత పవన్ కళ్యాణ్ కు పనేమీ ఉండదు కదా అని చురకలు అంటించారు. నిన్న పెడన సభలో పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలకు జోగి రమేష్ కౌంటర్‌ ఇచ్చారు. పెడనలో అటెన్షన్ కోసం పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేశాడని… సినిమా స్టైల్ లో కత్తులు, కటార్లు, రాళ్ళ తో దాడులు అని హడావిడి చేశాడని ఆగ్రహించారు.

రెండు వేల మందితో దాడులు అన్నాడు…పవన్ కళ్యాణ్ సభకు రెండు వందల మంది కూడా రాలేదని ఎద్దేవా చేశారు. అవనిగడ్డ లో పవన్ ఫ్లాప్ షో అని.. పెడనలో సూపర్ డూపర్ ప్లాప్ షో అంటూ చురకలు అంటించారు. జనసేన – టీడీపీ కలయిక వ్యాక్సిన్ కాదు పాయిజన్ అని విమర్శలు చేశారు. చంద్రబాబు స్కిల్ స్కాం లో ఆధారాలతో దొరికి ఊచలు లెక్క పెట్టుకుంటున్నాడు… జైల్లో ఉన్న దత్త తండ్రికి… పెడన ప్రజలు శాంతి కాముకులు అన్నారు. అటువంటి ప్రజల పై ఆరోపణలు చేసినందుకు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అత్తారింటికి దారేది సినిమా పైరసీ చేశారనే పేరుతో పెడనలో 30 మందిని అరెస్టు చేసి చిత్రహింసలు చేసిన చరిత్ర పవన్ కళ్యాణ్ ది అని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version