త్వరలోనే సీఎం జగన్.. దేశ ప్రధాని అవుతారు – వైసీపీ ఎమ్మెల్యే

-

కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలిచారని, అందుకే ఈ దేశానికి జగన్ ప్రధాని అవుతారని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రకటించారు. మంత్రి పదవి ఇవ్వలేదని అసంతృప్తిగా ఉన్నారని, గతంలో ప్రసన్నకుమార్ రెడ్డి పై ప్రచారం జరిగింది. గడప గడపలోను చాలా కాలం పాల్గొనలేదు. జగన్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఆ మాత్రమే ఆయన పాల్గొంటున్నారు.

అందుకే జగన్ పై సెటైర్ వేశారా లేకపోతే ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారా అన్నది కోవూరులో చర్చనీయాంశం అయింది. జగన్ అభ్యర్థులను మార్చనున్న నియోజకవర్గాల్లో కోవూరు కూడా ఉందని ఈసారి నల్లపురెడ్డి కుటుంబానికి జగన్ హ్యాండ్ ఇవ్వబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇతర పార్టీల్లోకి రానిచ్చే పరిస్థితి లేదని ఆయన ఆందోళన చెందుతున్నారు. అందుకే జగన్ ను పొగిడేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. కానీ ఆయన పొగడ్తలు సెటైర్లు లాగా ఉండడంతో వైసిపి నేతలు కూడా నవ్వుకుంటున్నారు. జగన్ కు అలాగే అనిపిస్తే ప్రసన్నకు మరిన్ని కష్టాలు తప్పవేమోనని కోవూరు నేతలు గుసగుసలాడుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news