జగన్ ఓడిపోయినా రక్త చరిత్ర రాస్తూనే ఉన్నాడు – నారా లోకేష్‌

-

జగన్ ఓడిపోయినా రక్త చరిత్ర రాస్తూనే ఉన్నాడని ఫైర్ అయ్యారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌. ఇవాళ మీడియాతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ మాట్లాడుతూ… వైఎస్ జగన్ ఓడిపోయినా రక్త చరిత్ర రాస్తూనే ఉన్నాడని..కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లెకి చెందిన టీడీపీ నేత గౌరీనాథ్ చౌదరిని దారుణంగా హత్య చేయించారని ఆగ్రహించారు.

జగన్ ఓడిపోయినా రక్త చరిత్ర రాస్తూనే ఉన్నాడు – నారా లోకేష్‌

వైసీపీ ఫ్యాక్షన్ పాలన వద్దని జనం ఛీకొట్టినా, బాబాయ్‌ని చంపినట్టే జనాన్ని చంపుతూ ఉన్నాడు జగన్ రెడ్డి అంటూ ఫైర్ అయ్యారు. హత్యా రాజకీయాలు ఇకనైనా జగన్ రెడ్డి ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి….గౌరీనాథ్ చౌదరి కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని వెల్లడించారు. నిందితులను వదిలే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ ఫ్యాక్షన్ దాడులకు చెక్ పెడతామని… శాంతిభద్రతలు కాపాడుతామని స్పష్టం చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version