ఏపీ సీఎం జగన్ తో సంభాషించిన ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము

-

రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార పక్షం ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది మూర్ము ఆదివారం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తో ఫోన్లో సంభాషించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ పై వారి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ తన మద్దతును ఎన్డీఏ అభ్యర్థికి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముర్ము నామినేషన్ పత్రాలపై వైసీపీ ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి లు సంతకాలు చేశారు.

ఇప్పటికే తన నామినేషన్ ను దాఖలు చేసిన ముర్ము.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పర్యటనకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఆదివారం జగన్ తో సంభాషించారు. ఈ సందర్భంగా తనకు మద్దతు ప్రకటించిన జగన్ కు ముర్ము కృతజ్ఞతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news