చంద్రబాబు మాట కాదు.. చిరంజీవి మాట వినండి – పవన్ కి రోజా సలహా

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు ఏపీ మంత్రి ఆర్కే రోజా. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ యాత్ర చేస్తున్నాడని దుయ్యబట్టారు. వారాహి పేరుతో చేస్తున్న నారాహి యాత్రను ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాట కాకుండా.. చిరంజీవి మాట వినాలని సలహా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఒకరోజు సీఎం అవుతానని, మరొక రోజు ఎమ్మెల్యే కావాలని అంటారని ఎద్దేవా చేశారు.

మమ్మల్ని కొడతానని చెప్పడానికి పార్టీ పెట్టారా..? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అమ్మవారి పేరుతో యాత్రలు చేస్తూ బూతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మీరు సింగిల్ గా లేదా గుంపులుగా వచ్చినా.. 2024లో జగనే ముఖ్యమంత్రి అవుతాడని వ్యాఖ్యానించారు. ఇక తనను ట్రోల్ చేస్తున్న జనసేన కార్యకర్తల అంతు చూస్తానని హెచ్చరించారు మంత్రి రోజా.

Read more RELATED
Recommended to you

Latest news