నీతి నియమాలు లేనివారే కెసిఆర్ పార్టీలో చేరుతారు – కేఏ పాల్

-

బిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైన ఆంధ్రప్రదేశ్ నేతలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శలు గుప్పించారు. డబ్బులకు ఆశపడే తోట చంద్రశేఖర్ బిఆర్ఎస్ లో చేరుతున్నాడని ఆరోపించారు. విలువలు లేని రాజకీయాలకు తోట చంద్రశేఖర్ తెరతీసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రులను అమ్మనా బూతులు తిట్టిన కేసీఆర్ పంచన చేరడం దారుణం అన్నారు కేఏ పాల్.

కుక్కలు, నక్కలు, నీచుల వలె కేసీఆర్ పార్టీలో జాయిన్ అవుతున్నారని మండిపడ్డారు. అటు రావెల కిషోర్ బాబు అవినీతి చక్రవర్తి అంటూ పాల్ ఫైర్ అయ్యారు. నీతి నియమాలు లేని వారే కెసిఆర్ పార్టీలో చేరతారని.. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని ఏపీ నేతలు కేసీఆర్ కు తాకట్టు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తోట చంద్రశేఖర్ ను కాపు సమాజం వెలివేయడం ఖాయం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news