చంద్రబాబును వెంటనే అరెస్ట్‌ చేయాలి : మంత్రి రమేశ్‌

-

కందుకూరు ఘటన మరిచిపోక ముందే.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సభలో మళ్లీ తోపులాట జరిగింది. గుంటూరులో చంద్రబాబు జనతా వస్త్రాలు, చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించి వెళ్లిపోయిన అనంతరం గందరగోళం నెలకొంది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. సభా వేదిక వద్ద ఒకరు మరణించగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటనపై మంత్రి జోగి రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి చంద్రబాబు చేసిన హత్యలేనని అన్నారు.

నాలుగు రోజుల క్రితమే 8 మందిని బలి తీసుకున్న చంద్రబాబు… ఇప్పుడు మరో ముగ్గురుని పొట్టనపెట్టుకున్నారని మండిపడ్డారు. కొత్త సంవత్సరం రోజున సంతోషంగా గడపాల్సిన వారికి విషాదాన్ని మిగిల్చారని విమర్శించారు. ఈ మరణాలకు కారణమైన చంద్రబాబును అరెస్ట్ చేయాలని అన్నారు. చంద్రబాబు సభలకు అనుమతిని ఇవ్వొద్దని డీజీపీని కోరుతున్నానని చెప్పారు. చంద్రబాబును రాష్ట్రంలో తిరగనిస్తే ఆయన మరింత మందిని బలి తీసుకుంటారని అన్నారు. బాబు అధికార దాహానికి ప్రజలు బలైపోతున్నారని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news