పవన్ కళ్యాణ్ కి బానిసత్వం చేయడంలో అలసత్వం రావడం లేదు – నందిగం సురేష్

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నందిగామ సురేష్. పవన్ కళ్యాణ్ ఊగుతూ వాగుతుంటారని.. సాధారణంగా మద్యం తాగిన వాళ్లే ఉగాలి, వాగాలి.. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు అలా ఊగుతున్నారు..? అని ప్రశ్నించారు. ఆయన ఏ క్లాస్ నుంచి ప్యాకేజ్ అందుకున్నారని నిలదీశారు. ఆయన పోటీ చేసిన స్థానాలలో ఖర్చుపెట్టిన డబ్బులు ఏ క్లాస్ నుంచి వచ్చింది, ఎవరు ఖర్చు పెట్టారో ప్రజలకు తెలుసని విమర్శలు గుప్పించారు.

పవన్ కళ్యాణ్ టీ గ్లాస్ తెచ్చుకుంటే.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు టీ పోశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకి బానిసత్వం చేయడంలో పవన్ కళ్యాణ్ కి అలసట రావడం లేదని దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్ తనకు తాను సత్య హరిశ్చంద్రుడు అనుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికలలో వైసీపీఏ విజయం సాధిస్తుందని.. జగనే ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version