వైసిపి వాళ్లు టిడిపిని వదిలేసి జనసేనపై పడుతున్నారు – పవన్ కళ్యాణ్

-

వైసిపి ప్రభుత్వం పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నేడు గుంటూరు జిల్లా మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. జనసేన పార్టీ గురించి వైసీపీకి ఎందుకని ప్రశ్నించారు. మీ నాయకుడు 175 కి 175 స్థానాలు గెలుస్తాం అంటున్నాడని.. మీ దృష్టిలో మేము ఏం చేయలేమని అనుకుంటున్నాప్పుడు మేమంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.

వైసిపి వాళ్లు టిడిపిని వదిలేసి జనసేనపై పడుతున్నారని.. అంటే మేం ఏదో చేస్తామనే కదా..? ఆ భయం ఉండాలని అన్నారు. తనపై బూతులు మాట్లాడే వారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించండి చూద్దాం..! అన్నారు పవన్ కళ్యాణ్. ఇక తాను ఓ కులానికి నాయకుడిని కాదని.. మానవతావాదినని, సమాజం బాగుండాలని కోరుకునే వాడినన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news