వైసీపీ పార్టీ కోటలు బద్దలు కొడతాం – పవన్‌ కల్యాణ్‌ వార్నింగ్‌

-

వైసీపీ గడప కూల్చేదాకా వదిలిపెట్టబోమని, వైసీపీ పార్టీ కోటలు బద్దలు కొడతామని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఇవాళ ఇప్పటం బాధితులకు ఆర్థిక సాయం చేశారు పవన్‌ కళ్యాణ్‌. ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ, నాకు అండగా ఉన్న ఇప్పటం ప్రజలకు నేను అండగా ఉంటానని ప్రకటించారు.

పరిహారం ఇవ్వకుండా ఇళ్లు కూలగొట్టడం బాధ కలిగించింది. వైసీపీ గడప కూల్చేదాకా వదిలిపెట్టమని హెచ్చరించారు. కూల్చివేతలో పద్ధతి పాటించలేదు. అంతా కక్షతో చేశారు. రైతులు తెగువ చూపించి ఉంటే అమరావతి కదిలేది కాదన్నారు పవన్‌ కల్యాణ్‌.

జనసేన పార్టీకి స్థలం ఇచ్చారని ఒకే ఒక కారణంతో ఇప్పటంలో ఇలాంటి పూజ చేశారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు కుంచకుండా వదిలేసి కక్షపూరితంగా వ్యవహరించాలని మండిపడ్డారు పవన్. ఇప్పటం ప్రజలకు భయపడ వద్దని తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఇవ్వడం ప్రజల తెగింపు అమరావతి రైతులు కూడా చూపించి ఉంటే రాజధాని అక్కడి నుంచి కదిలేని కాదని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. భయపడితే చంపేస్తారని భయపడకుండా నిలబడాలని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news