దుష్టచతుష్టయం అంటే.. చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5 నాయుడు – పేర్ని నాని

-

దుష్ట చతుష్టయం అంటే.. చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5 నాయుడు అని ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఇవాళ వైసీపీ ప్లీనరీలో పేర్ని నాని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…దుష్టచతుష్టయం లో మొదటి దొంగ చంద్రబాబు, రెండో దొంగ రామోజీరావు, మూడో దొంగ రాధాకృష్ణ, నాలుగో దొంగ టీవీ-5 నాయుడు. నలుగురు కలిసి మీడియా వ్యవస్థను దారుణం చేశారని నిప్పులు చెరిగారు.

రామోజీరావు నమ్మకద్రోహి అని ఎన్టీఆరే అన్నారని గుర్తు చేశారు. ఏ గడప తట్టినా జగన్‌ నినాదమే మారుమోగుతోందని పేర్ని నాని చెప్పారు. ఏపీ లో జగన్‌ మోహన్‌ రెడ్డి హవా నడుస్తోందని.. వైసీపీ పార్టీ ని ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం తధ్యమని వెల్లడించారు. ఎల్లో మీడియా ప్రతిరోజు విషం చిమ్ముతోంది.. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధిని చూసి ఓర్వలేకే తప్పుడు ప్రచారం చేస్తోందని ఫైర్‌ అయ్యారు పేర్ని నాని.

Read more RELATED
Recommended to you

Latest news