ఈనెల 13న విజయవాడకు పురందేశ్వరి

-

ఆంధ్రప్రదేశ్ బిజెపి నూతన అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఈనెల 13న విజయవాడకి రానున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలి హోదాలో తొలిసారి పార్టీ కార్యాలయానికి పురందేశ్వరి రానున్న నేపథ్యంలో భారీగా స్వాగతం ఏర్పాట్లకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణ రాజు. గన్నవరం విమానాశ్రయం నుండి విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు భారీ ర్యాలీ ఉంటుందని తెలిపారు.

రహదారి పొడవునా బిజెపి పతాకాలు, ప్లెక్సీలతో అలంకరణ చేయనున్నామని తెలిపారు. ఇక అదే రోజు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందేశ్వరి బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు. వెన్యూ ఫంక్షన్ హాల్ లో నిర్వహించే బీజేపీ కార్యకర్తల సమావేశంలో పురందేశ్వరి పాల్గొని ప్రసంగిస్తారని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news