పవన్ కళ్యాణ్ “వారాహి” యాత్ర 2 షెడ్యూల్ విడుదల…

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత వారంలో ఉభయగోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర పేరుతో ప్రజలందరినీ కలిసి మాట్లాడి నన్ను గెలిపిస్తే ఏమి చేస్తానో చెప్పిన విషయం తెలిసిందే. కొందరు నేతలు చెబుతున్న ప్రకారం ఈ యాత్ర సక్సెస్ అని మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు రెండవ విడుత వారాహి యాత్ర షెడ్యూల్ ను కూడా జనసేన ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం జులై 9వ తేదీన ప్రారంభమై 12వ తేదీ వరకు జరగనుంది. ఇందులో భాగంగా 9వ తేదీన ఏలూరులో బహిరంగ సభ జరగనుంది, ఆ తర్వాత రోజున జనవాణి పేరుతో ఏలూరులోని ముఖ్య నాయకులు మరియు వీర మహిళలతో మీటింగ్ జరగనుంది. మరుసటి రోజుల దెందులూరు నియోజకవర్గంలోని నాయకులతో మీటింగ్ పూర్తి చేసుకుని తాడేపల్లిగూడెం కు చేరుకోనున్నారు పవన్ కళ్యాణ్.

ఇక ఆఖరి రోజున తాడేపల్లిగూడెం లో బహిరంగ సభ లో పాల్గొంటారు. దీనితో రెండవ విడతలో భాగంగా వారాహి యాత్ర పూర్తి అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news