భారీ ఉద్యమానికి శ్రీకారం చుట్టి..మా తడాఖా చూపిస్తాం : జగన్‌ సర్కార్‌ కు ఉపాధ్యాయులు వార్నింగ్‌ !

-

ఏపీ సర్కార్‌ కు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది ఉపాధ్యాయుల సంఘం. పీఆర్సీ సాధన కమిటీలో స్టీరింగ్ కమిటీ పదవులకు రాజీనామా చేశారు ఏపీ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు. ఫిట్ మెంట్ మీద చర్చ జరగాలని మంత్రులను కోరామని….కానీ మమ్మల్ని మోసం చేసి చర్చలు ముగిశాయి అని ప్రకటించేశారని ఫైర్‌ అయ్యారు STU రాష్ట్ర అధ్యక్షుడు సుధీర్ బాబు. ప్రభుత్వం ఆర్థిక స్థితిగతులు చెప్పి మా జీతాలు తగ్గించారని.. చర్చల పేరుతో ఉద్యమాన్ని నీరు కార్చారని చురకలు అంటించారు.

ఫిట్ మెంట్ కాదు కనీసం అడిగిన ఐఆర్ కూడా ఇవ్వలేదని నిప్పులు చెరిగారు STU రాష్ట్ర అధ్యక్షుడు సుధీర్ బాబు. మమ్మల్ని మోసం చేసిన పీ అర్ సీ సాధన కమిటీ తీరుకు నిరసనగా ఈ రాజీనామాలు చేస్తున్నామని.. భవిష్యత్ లో కొత్త స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఎస్ టీ యూ, యూ టీ ఎఫ్, ఏపీ టీ ఎఫ్ లతో పాటు కలిసి వచ్చే ఉద్యోగ సంఘాల మద్దతుతో భారీ ఉద్యమానికి శ్రీకారం చుడతామని…తమ తడాఖా చూపిస్తామని జగన్‌ సర్కార్‌ కు వార్నింగ్‌ ఇచ్చారు STU రాష్ట్ర అధ్యక్షుడు సుధీర్ బాబు.

Read more RELATED
Recommended to you

Latest news