బ్రేకింగ్ : ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ఖరారైన ముహూర్తం..

-

అమరావతి: ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైన సమాచారం అందుతోంది. ఏప్రిల్‌ 11 న కొత్త మంత్రుల ప్రమా ణ స్వీకారం ఉండే ఛాన్స్ ఉనట్లు సమాచారం అందుతోంది.. రెండున్నరేళ్ల తర్వాత మంత్రుల్ని మారుస్తానని గతంలోనే చెప్పిన సీఎం వైఎస్‌ జగన్.. ఆ మేరకు ఆయన అడుగులు వేస్తున్నారు.

ఇక ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైన నేపథ్యంలో నేతలలో అలజడి నెలకొంది. ఏపీ కేబినెట్‌లో మార్పులు, చేర్పులపై నేతలు తెగ టెన్షన్‌ పడుతున్నారు. అయితే ఈ పునర్వ్యవస్థీకరణలో ఎవరికి పదవి దక్కుతుందనే టెన్షన్ అందరిలోనూ ఉంది.

ఇక మంత్రి కొడాలి నాని, పేర్ని నాని, బొత్స సత్యనారాయణ మినహా మిగతా అందరికీ పదవులకు గండం ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు మినహా మిగతా అందరినీ సీఎం జగన్ మార్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news