తెలుగు రాష్ట్రాల ప్రజలను దుష్ట చతుష్టయం మోసం చేస్తోంది – మంత్రి దాడిశెట్టి రాజా

-

కాకినాడ లోని తుని లో మంత్రి దాడిశెట్టి రాజా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల ప్రజలను దుష్ట చతుష్టయం మోసం చేస్తుందన్నారు. తొండంగి మండలంలో ఏర్పాటు కానున్న బల్క్ డ్రగ్ పార్క్ ను స్ధానిక మత్స్యకారులు, హేచరీ యాజమానులు స్వాగతిస్తున్నారని.. ఈ ప్రాజెక్ట్ ను అడ్డుకునేందుకు చంద్రబాబు యనమల తో లేఖ రాయించి కుట్ర పన్నుతున్నాడని ఆరోపించారు మంత్రి దాడిశెట్టి రాజా.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు వచ్చినా.. పరిశ్రమలు వచ్చినా దుష్ట్ర చతుష్టయానికి ఏడుపులేనన్నారు. కరోనా వచ్చినా మన రాష్ట్రం డబుల్ డిజిట్ గ్రోత్ లో ఉందన్నారు. పచ్చ మీడియా ఈ విషయాన్ని రాయదని అన్నారు. ఏ హక్కు ఉందని చంద్రబాబు,లోకేష్ లు హైదరాబాదు ను తాకట్టు పెట్టారని ప్రశ్నించారు. దుష్ట చతుష్టయం చేస్తున్న అన్యాయాలను, బ్లాక్ మెయిలింగ్ ను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో చంద్రబాబు, లోకేష్ లకు ప్రజలు బుద్ది చెబుతారని అన్నారు మంత్రి దాడిశెట్టి రాజా.

Read more RELATED
Recommended to you

Latest news